దారుణం.. భర్త కళ్లముందే భార్యను పోలాల్లోకి లాక్కెళ్లి..

ABN , First Publish Date - 2021-03-17T00:33:09+05:30 IST

రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త కళ్లముందే ఓ మహిళ అత్యాచారానికి గురైంది. మాజీ భర్త తమ్ముడు ఈ నీచానికి పాల్పడ్డాడు.

దారుణం.. భర్త కళ్లముందే భార్యను పోలాల్లోకి లాక్కెళ్లి..

జైపూర్: రాజస్థాన్‌లోని భరణ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త కళ్లముందే ఓ మహిళ అత్యాచారానికి గురైంది. మాజీ భర్త తమ్ముడు ఈ నీచానికి పాల్పడ్డాడు. బాధితురాలు  కొద్ది కాలం క్రితం బాధితురాలు తన భర్త నుంచి విడిపడి  మరో వ్యక్తిని వివాహమాడిందని పోలీసులు తెలిపారు. పిల్లలు లేకపోవడంతో ఆమె మొదటి భర్త నుంచి వేరుపడిందన్నారు. శనివారం రాత్రి బాధితురాలు తన భర్త, కూతురుతో కలిసి ఇంటి వస్తుండగా..నిందితుడు తన స్నేహితులతో కలసి ఆమెను అడ్డగించాడు. వాళ్లను బలవంతంగా పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లారు. ఆమె భర్తపై దాడి చేసి కాళ్లూ చేతులూ కట్టేసిన అనంతరం.. నిందితుడు మహిళపై ఆమె భర్త కళ్లుముందే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు, ఆమె చెల్లెలు ఎలాగొలా కష్టపడి ప్రధాని రహదారికి చేరుకుని అక్కడున్న వారిని అప్రమత్తం చేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురిపై పోలీసులు అత్యాచారంతో సహా వివిధ సెక్షన్ల కేసు నమోదు చేశారు. ఆదివారం నాడు మాజీ భర్త తమ్ముడితో పాటూ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-03-17T00:33:09+05:30 IST