Qualifier 2: కీలక పోరుకు రంగం సిద్ధం.. ఫైనల్ బెర్త్ ఎవరికో?
ABN , First Publish Date - 2022-05-27T21:37:13+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సెమీస్ కాని సెమీస్ నేడు జరగబోతోంది. ఫైనల్ కా బాప్ అనుకునేలా రాయల్ చాలెంజర్స్
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సెమీస్ కాని సెమీస్ నేడు జరగబోతోంది. ఫైనల్ కా బాప్ అనుకునేలా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)-రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఢీకొనబోతున్నాయ్. అహ్మదాబాద్లో సెకండ్ క్వాలిఫయర్లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ట్రోఫీ కోసం గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. దీంతో ఆర్సీబీ-రాజస్థాన్ రాయల్స్ సై అంటే సై అంటున్నాయి.
రెండో క్వాలిఫయర్లో తమ దమ్మేంటో చూపించేందుకు రెడీ అయ్యాయి..! సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ముందు నుంచి దూకుడుగానే ఉంది. 9 మ్యాచ్ల్లో గెలిచి 18 పాయింట్లతో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్లో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. దీంతో సెకండ్ క్వాలిఫయర్లో దూకుడు చూపాలనుకుంటోంది.
మరోవైపు, రాయల్ చాలెంజర్స్ సాలిడ్గా ఉంది. హాట్ ఫేవరెట్గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆర్సీబీ ఈజ్ ఆర్సీబీ అనుకునేలా ఆకట్టుకుంటోంది. ఎలిమినేటర్లో లక్నో సూపర్ జెయింట్స్పై విజయంతో మరింత ఉత్సాహంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకుపోవాలని పట్టుదలగా కనిపిస్తోంది. లీగ్ దశలో ఆర్సీబీ 8 మ్యాచ్ల్లో గెలిచింది. అయితే నిలకడగా ఆడలేదని ఫ్యాన్స్ కాస్త ఫీలయ్యారు.
కానీ ఎలిమినేటర్లో ఆర్సీబీ ఆటతీరు చూసి మురిసిపోయారు. ఇప్పుడు గెలుపు జోరును కొనసాగించాలనుకుంటున్నారు. కోహ్లీ,డుప్లెసిస్, మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పటీదార్ ఫామ్లో ఉండటం కలిసి రానుంది. బట్లర్,చాహల్పై రాజస్థాన్ రాయల్స్ భారీ ఆశలే పెట్టుకుంది. మొత్తానికి ఐపీఎల్లో ఫైట్ ఆఫ్ ది సీజన్ ఉత్కంఠ రేపుతోంది.