‘రాజస్థాన్‌’ ఫీల్డింగ్‌ కోచ్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-08-13T09:21:25+05:30 IST

ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్జ్జుకు షాక్‌ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ దిషాంత్‌ యాగ్నిక్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో ఇదే తొలి

‘రాజస్థాన్‌’ ఫీల్డింగ్‌ కోచ్‌కు కరోనా

జైపూర్‌: ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్జ్జుకు షాక్‌ తగిలింది. ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ దిషాంత్‌ యాగ్నిక్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో ఇదే తొలి పాజిటివ్‌ కేసు కావడం గమనార్హం. తన స్వస్థలం ఉదయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో దిషాంత్‌ చికిత్స తీసుకుంటున్నాడు. అతను తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేయాలి. ఈ లీగ్‌కు వేదికైన యూఏఈ వెళ్లేందుకు రాజస్థాన్‌ ఆటగాళ్లు ముంబైలో వచ్చేవారం కలవనున్నారు. రాజస్థాన్‌ క్రికెటర్లతోపాటు సిబ్బందికి కూడా రెండుసార్లు కరోనా పరీక్షలు చేయాలని బీసీసీఐ సూచించింది. దీంతో జట్టుతో చేరాలంటే దిషాంత్‌ కూడా రెండుసార్లు కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. నెగెటివ్‌ వస్తేనే అతణ్ణి దుబాయ్‌ వెళ్లేందుకు అనుమతిస్తారు. కాగా, వచ్చే సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వ తేదీ వరకు ఈ సీజన్‌ ఐపీఎల్‌ జరగనుంది.


Updated Date - 2020-08-13T09:21:25+05:30 IST