రాజస్థాన్లో ఒకే రోజు 21 ఒమైక్రాన్ కేసులు
ABN , First Publish Date - 2021-12-26T01:43:09+05:30 IST
కరోనా నయా వేరియంట్ ఒమైక్రాన్ దేశంలో క్రమంగా అల్లకుపోతోంది. కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది.
జైపూర్: కరోనా నయా వేరియంట్ ఒమైక్రాన్ దేశంలో క్రమంగా అల్లుకుపోతోంది. కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. రాజస్థాన్లో నేడు ఏకంగా 21 కేసులు కేసులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మేరకు పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి రిపోర్టు అందినట్టు రాజస్థాన్ ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా కేసులతో కలుపుకుని రాజస్థాన్లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 43కి పెరిగింది. జైపూర్లో 11, అజ్మీర్లో ఆరు, ఉదయ్పూర్లో మూడు కేసులు తాజాగా నమోదయ్యాయి. వీరిలో ఐదుగురు విదేశాల నుంచి వచ్చినవారు కాగా, వారితో కాంటాక్ట్ అయిన ముగ్గురు బాధితులు కూడా ఉన్నారు. మిగతా వారిని కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా గుర్తించారు. ఇక, మొత్తం కేసుల్లో 28 జైపూర్లో, అజ్మీర్లో 7, సికర్లో నాలుగు, ఉదయ్పూర్లో మూడు నమోదయ్యాయి.