రాజస్థాన్లో కొత్తగా మరో 1,213 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-08-13T04:45:48+05:30 IST
రాజస్థాన్లో కొత్తగా ఇవాళ మరో 1,213 మందికి కొవిడ్-19 సోకినట్టు గుర్తించారు. ఈ మహమ్మారి కారణంగా..
జైపూర్: రాజస్థాన్లో కొత్తగా ఇవాళ మరో 1,213 మందికి కొవిడ్-19 సోకినట్టు గుర్తించారు. ఈ మహమ్మారి కారణంగా గడచిన 24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 56,100 మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకగా.. 822 మంది మృత్యువాత పడినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాజస్థాన్ 13,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 39,092 మంది కరోనా బారి నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.