-
-
Home » Prathyekam » rajasthan man kills his friend for affair with ex girlfriend sgr spl-MRGS-Prathyekam
-
స్నేహితుడు, మాజీ ప్రేయసి మధ్య అఫైర్.. విషయం తెలుసుకున్న యువకుడు ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-05-05T20:11:32+05:30 IST
అతను ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు.. కొన్ని రోజుల అనంతరం ఆమె నుంచి విడిపోయాడు..
అతను ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు.. కొన్ని రోజుల అనంతరం ఆమె నుంచి విడిపోయాడు.. ఆమె తన ప్రాణ స్నేహితుడితోనే అఫైర్ పెట్టుకుందని తెలుసుకున్నాడు.. దీంతో స్నేహితుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు.. ఒకసారి మాట్లాడదామని చెప్పి పిలిచాడు.. అతడితో గొడవకు దిగి క్షణికావేశంలో కొట్టి చంపేశాడు.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాకు చెందిన పరమ్ జీత్ సింగ్, దీపక్ కుమార్ ప్రాణ స్నేహితులు. పరమ్ జీత్ కొన్ని రోజుల క్రితం వరకు ఓ యువతితో డేటింగ్ చేసి ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. పరమ్తో బ్రేకప్ తర్వాత ఆ యువతి దీపక్కు క్లోజ్ అయింది. దీపక్, ఆ యువతి తరచుగా కలుసుకునేవారు. తన మాజీ లవర్, ప్రాణ స్నేహితుడి మధ్య అఫైర్ ఉందనే విషయం పరమ్కు తెలిసింది. దీపక్ తనకు నమ్మకం ద్రోహం చేశాడని పరమ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.
ఒకసారి మాట్లాడుకుందామని దీపక్ను పరమ్ తన ఇంటికి పిలిచాడు. అక్కడ అమ్మాయి విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన పరమ్.. దీపక్ను కర్రతో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో దీపక్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీపక్ మృతదేహాన్ని పరమ్ ఒక సంచిలో పెట్టి అడవిలోకి తీసుకెళ్లి కాల్చేశాడు. దీపక్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సబ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరూ పరమ్పైనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు పరమ్ను అదుపులోకి తీసుకొని విచారించగా అతను అసలు విషయం చెప్పేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరమ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.