ఒకే అమ్మాయిని ప్రేమించిన దాయాదుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-09T15:34:54+05:30 IST

ఒకే అమ్మాయిని ప్రేమించిన దాయాదులైన ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన....

ఒకే అమ్మాయిని ప్రేమించిన దాయాదుల ఆత్మహత్య

జైపూర్ (రాజస్థాన్): ఒకే అమ్మాయిని ప్రేమించిన దాయాదులైన ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బుండి జిల్లా కేవవపురా గ్రామంలో జరిగింది. డబ్లానా పోలీసుస్టేషను పరిధిలోని కేశవ్ పురా గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్ (23),దేవరాజ్ గుర్జర్ (23)లు బంధువులు. వీరిద్దరూ ఆశా అనే అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నారు. వారు తమ చేతుల మీద ఆశా అని పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. ఇద్దరు యువకులు గుడ్లా గ్రామానికి సమీపంలో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. 


Updated Date - 2021-03-09T15:34:54+05:30 IST