రాజస్థాన్లో కరోనా కొత్త రికార్డులు
ABN , First Publish Date - 2020-07-06T14:53:04+05:30 IST
రాజస్థాన్లో కరోనా ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా నమోదైన రికార్డు అందరినీ షాక్కు గురిచేసింది. రాజస్థాన్లో ఇప్పటివరకు అత్యధికంగా ఒక్కరోజులో ఏకంగా 632 కేసులు నమోదయ్యాయి.
జైపూర్: రాజస్థాన్లో కరోనా ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా నమోదైన రికార్డు అందరినీ షాక్కు గురిచేసింది. రాజస్థాన్లో ఇప్పటివరకు అత్యధికంగా ఒక్కరోజులో ఏకంగా 632 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది. కొత్తగా ప్రతాప్గఢ్లో గరిష్టంగా 65, జోధ్పూర్, బీకానెర్లో 57 చొప్పున, జైపూర్, అల్వార్లో 47 చొప్పున, పాలిలో 46, జలోర్లో 41, రాజ్సమంద్లో 37, భరత్పూర్లో 34, అజ్మీర్లో 31, నాగౌర్లో 30, ధోల్పూర్లో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో వలస కార్మికుల కారణంగా కరోనా వ్యాప్తి చెందుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్లో ఇప్పటివరకు 15,928 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 80 శాతానికి పైగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. యాక్టివ్ కేసు సంఖ్య 3780గా ఉండగా, మృతుల సంఖ్య 500కు చేరువలో ఉంది.