సాయంత్రం 5 గంటలకు సీఎం గెహ్లోత్, పైలట్ ముఖాముఖి

ABN , First Publish Date - 2020-08-13T21:50:01+05:30 IST

సీఎం అశోక్ గెహ్లోత్ నివాసంలో గురువారం సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

సాయంత్రం 5 గంటలకు సీఎం గెహ్లోత్, పైలట్ ముఖాముఖి

జైపూర్ : సీఎం అశోక్ గెహ్లోత్ నివాసంలో గురువారం సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి యువనేత సచిన్ పైలట్ కూడా హాజరుకానున్నారు. సచిన్ పైలట్ నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు కథ సుఖాంతం అయిన తర్వాత జరుగుతున్న మొదటి సీఎల్పీ సమావేశం ఇది. ఈ సమావేశం వేదికపైనే సీఎం గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ ఒకరినొకరు కలుసుకోనున్నారు.


శుక్రవారం కీలకమైన అసెంబ్లీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ సీఎల్పీకి ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కరోనా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, లాక్‌డౌన్ పరిణామాలను చర్చిస్తాం. దీనికి అందరూ సహకరిస్తారని భావిస్తున్నాం. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఇది ఉపయోగపడుతుంది’’ అని సీఎం గెహ్లోత్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-08-13T21:50:01+05:30 IST