రాజస్థాన్ గవర్నరును కలవనున్న సీఎం అశోక్ గెహ్లాట్...దీపావళికి ముందే cabinet reshuffle

ABN , First Publish Date - 2021-10-25T17:56:07+05:30 IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసే అవకాశం ఉంది...

రాజస్థాన్ గవర్నరును కలవనున్న సీఎం అశోక్ గెహ్లాట్...దీపావళికి ముందే cabinet reshuffle

జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసే అవకాశం ఉంది.దీపావళికి ముందే రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయంగా చర్చలు సాగుతున్నాయి. విస్తరణ వార్తలతో రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి. దేశంలో ఉక్కిరిబిక్కిరి వాతావరణం ఏర్పడిందని ,దీనిని తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం కోరారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా భయాందోళనలు సృష్టించడానికి సిద్ధంగా ఉండాలని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరిందని సీఎం ఆరోపించారు. ఎన్నికల్లో మోదీ గెలిచినప్పటి నుంచి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని, ఇది దురదృష్టకరమని అన్నారు.  అప్పుడు ప్రజల్లో భయాందోళనల వాతావరణం ఏర్పడిందని, ఈ వాతావరణాన్ని మోదీ తొలగించాలని గెహ్లాట్ బీజేపీ పేరు చెప్పకుండా విలేకరులతో వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-10-25T17:56:07+05:30 IST