రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 175
ABN , First Publish Date - 2020-10-01T03:05:33+05:30 IST
ఐపీఎల్ 2020లో భాగంగా కోల్కత్తా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో...
దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా కోల్కత్తా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో నైట్రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన నైట్రైడర్స్ జట్టుకు ఓపెనర్ నరైన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉనద్కట్ బౌలింగ్లో బౌల్డ్ కావడం షాకిచ్చింది. అయితే.. మరో ఓపెనర్ గిల్ 47 పరుగులతో రాణించి.. ఆర్చర్ బౌలింగ్లో షాట్కు యత్నించి క్యాచ్గా చిక్కడంతో పెవిలియన్ బాట పట్టాడు.
రస్సెల్ మూడు సిక్స్లతో దూకుడుగా ఆడుతుండగా.. రాజ్పుత్ బౌలింగ్లో ఉనద్కట్కు క్యాచ్గా చిక్కి 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. నితీష్ రాణా 22 పరుగులు చేశాడు. చివర్లో మోర్గాన్ 34 పరుగులు, కమ్మిన్స్ 12 పరుగులు, నగర్కోటి 8 పరుగులు చేయడంతో 20 ఓవర్లు ముగిసే సరికి నైట్రైడర్స్ జట్టు 174 పరుగులు చేసింది.
రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్కు 2 వికెట్లు, అంకిత్ రాజ్పుత్, ఉనద్కట్, టామ్ కరన్, రాహుల్ తెవాటియాలకు తలో వికెట్ దక్కింది. 175 పరుగుల లక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కు దిగనుంది. బ్యాటింగ్పరంగా చూస్తే.. రాజస్థాన్కు సంజూ శాంసన్, రాహుల్ తెవాటియా, స్మిత్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. బట్లర్ గత మ్యాచ్లో పేలవ ఆటతీరు కనబర్చడం గమనార్హం.