బైక్ మీద మరో వ్యక్తి ఉన్నా.. తెలిసిన వ్యక్తే కదా అని వెళ్లింది.. కొద్ది దూరం వెళ్లాకా వాళ్లు చేసిన పనికి 11ఏళ్ల బాలిక షాక్!

ABN , First Publish Date - 2021-10-20T16:37:58+05:30 IST

ఆ బాలిక ఇంటి బయట పక్కింటివాళ్లతో..

బైక్ మీద మరో వ్యక్తి ఉన్నా.. తెలిసిన వ్యక్తే కదా అని వెళ్లింది.. కొద్ది దూరం వెళ్లాకా వాళ్లు చేసిన పనికి 11ఏళ్ల బాలిక షాక్!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఆ బాలిక ఇంటి బయట పక్కింటివాళ్లతో మాట్లాడుతోంది. బైక్‌పై స్నేహితుడితోపాటు వచ్చిన వ్యక్తి ఆ బాలికతో మాటలు కలిపాడు. బయటకు వెళ్లొద్దామంటూ.. బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లాక వాళ్లు చేసిన పనికి ఆమె మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


జిల్లాలోని ఓ నగరానికి చెందిన 11ఏళ్ల బాలిక ఇంటి బయట కొంతమందితో ముచ్చటిస్తోంది. మలపూర గేట్‌కు చెందిన రాజ్‌కుమార్ నగర్(22).. సంగనేర్‌లోని కృష్ణానగర్‌కు చెందిన అషు కుమార్ సింగాల్(19)తో కలిసి బైక్‌పై ఆ బాలిక ఉన్న ప్రాంతానికి వచ్చాడు. తెలిసిన వ్యక్తే కావడంతో రాజ్‌కుమార్‌తో ఆ బాలిక మాట్లాడింది. బయటకు వెళ్తున్నాం.. నువ్వు కూడా రా.. అంటే ఆ బాలిక సరేనని బైక్ ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాకా జలానా అడవుల ప్రాంతంలో వాళ్లు చేసిన పనికి ఆ అమ్మాయి షాకైంది.







బైక్‌ను పక్కకు ఆపి.. అటవీ ప్రాంతంలోకి ఆ బాలికను తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం చేసి.. తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఆ బాలిక ఇంటికి వెళ్లిన వెంటనే తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. బాలికను తీసుకుని ఆ తల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.


సంగనేర్ ఏసీపీ నేమిచంద్ మాట్లాడుతూ ఈ సంఘటన సెప్టెంబర్ 16న జరిగిందని చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే తల్లీకూతరు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారని తెలిసి పారిపోయారన్నారు. నెలనుంచి తప్పించుకుని తిరుగుతన్న నిందితులు మంగళవారం పట్టుబడ్డారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామన్నారు.



Updated Date - 2021-10-20T16:37:58+05:30 IST