మంత్రి కేటీఆర్‌కు రాజాసింగ్ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-25T16:25:14+05:30 IST

మంత్రి కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక జారీ చేశారు. స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీని తరిమికొడతామని రాజాసింగ్ పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌కు రాజాసింగ్ హెచ్చరిక

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక జారీ చేశారు. స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీని తరిమికొడతామని రాజాసింగ్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటోన్న మునావర్ ఫారూఖీని 16రాష్ట్రాలు వెలివేశాయని.. ఆయనను మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు ఆహ్వానించటాన్ని ఖండిస్తున్నానన్నారు. హైదరాబాద్ వేదికగా జనవరి 9న జరగబోయే ఫారూఖీ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరుతామని రాజాసింగ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ హిందూ దేవాలయాలను నిర్మిస్తారని.. అలాగే పూజిస్తారన్నారు. ఒక్కసారి ఫారూఖీని హైదరాబాద్‌కు ఆహ్వానించే ముందు కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ముఖమైనా చూడాల్సిందన్నారు. మునావర్ ఫారూఖీని హిందువుల దేవుళ్ళపై కామెడీ చేయటాన్ని కేటీఆర్ సమర్థిస్తున్నారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.

Updated Date - 2021-12-25T16:25:14+05:30 IST