మంత్రి కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన రాజాసింగ్
ABN , First Publish Date - 2022-02-16T21:49:02+05:30 IST
మంత్రి కేటీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్: మంత్రి కేటీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ ట్విట్టర్ మ్యాన్గా మారిపోయారని సెటైర్లు వేశారు. తెలంగాణలో పెద్ద జోకర్ ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. బీజేపీపై కేసీఆర్, కేటీఆర్ అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందువులకు వ్యతిరేకంగా ఉన్నవారిని గుర్తించి బుల్ డోజర్తో తొక్కిస్తామన్నారు. ఉత్తర ప్రదేశ్లో భారీ మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని రాజాసింగ్ మరోసారి స్పష్టం చేశారు.