మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రాజాసింగ్
ABN , First Publish Date - 2021-07-19T21:02:45+05:30 IST
మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపు ఇచ్చారు.
హైదరాబాద్: నగరంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపు ఇచ్చారు. ఏ క్షణమైన హిమాయత్సాగర్ గేట్లు ఎత్తే అవకాశముందన్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో రోజు వర్షాలు కురుస్తున్నాయని దీంతో హిమాయత్సాగర్, గండిపేటకు భారీగా వరద నీరు చేరుతుందని, ఏ క్షణమైన గేట్లు ఎత్తే అవకాశముందని రాజాసింగ్ పేర్కొన్నారు.