రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారు: దేవినేని

ABN , First Publish Date - 2021-10-03T01:52:23+05:30 IST

రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌తో కుమ్మక్కై తప్పులు చేస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారు: దేవినేని

అమరావతి: రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌తో కుమ్మక్కై తప్పులు చేస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గెలిచిన అభ్యర్థిని ఓడించాలని ప్రయత్నించారని మండిపడ్డారు. తప్పును సహకరించకూడదని ఓ పోలీస్ అధికారి నిజాయతీగా వ్యవహరించారని, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్టీ సోదరుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Updated Date - 2021-10-03T01:52:23+05:30 IST