వైభవంగా రాజరాజేశ్వరుని కల్యాణం

ABN , First Publish Date - 2021-02-25T06:50:14+05:30 IST

యానాంలోని రాజరాజేశ్వరీ సమేత రాజరాజేశ్వరుని కల్యాణోత్సవాల్లో భాగంగా బుధ వారం దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్‌ ఆధ్వర్యంలో రాజేశ్వరుని కల్యాణం ఘనంగా నిర్వహించారు.

వైభవంగా రాజరాజేశ్వరుని కల్యాణం

యానాం, ఫిబ్రవరి 24: యానాంలోని రాజరాజేశ్వరీ సమేత రాజరాజేశ్వరుని కల్యాణోత్సవాల్లో భాగంగా బుధ వారం దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్‌ ఆధ్వర్యంలో రాజేశ్వరుని కల్యాణం ఘనంగా నిర్వహించారు.  ఉత్సవదారులైన మన్యం కనకయ్య జమిందార్‌ కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. యా నాం ప్రజల, పుదుచ్చేరి ప్రభుత్వం తరపున కాపగంటి ఉమా శంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జి.గౌరిసరోజా దంపతులు ముత్యాల తలంబ్రాలు, సువర్ణ మంగళసూత్రం, సువర్ణ యజ్జోపవీతం సమర్పించారు.  కల్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శివాలయ ప్రాం గణం కిక్కిరిసింది.  వందలాది మంది భక్తులకు అన్న ప్రసాదం స్వీకరించారు. సాయంత్రం విశ్వబ్రాహ్మణ సంఘం ఉత్స వదారులుగా ఉన్న గజవాహనంపై స్వామివారిని యానాం పురవీధుల్లో ఊరేగించారు.  కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్‌, ఉపాధ్యక్షుడు గంధం శంకర్రావు, కోశాధికారి కాదా వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఆకుల నాగేశ్వరరావు, మెంబర్‌ కొంకిపూడి గాంధి  పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-25T06:50:14+05:30 IST