స్కందమాత అలంకారంలో రాజరాజేశ్వరీదేవి
ABN , First Publish Date - 2022-10-01T05:39:36+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో రాజరాజేశ్వరీదేవి అమ్మవారు శుక్రవారం స్కందమాత అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.
వేములవాడ, సెప్టెంబరు 30: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో రాజరాజేశ్వరీదేవి అమ్మవారు శుక్రవారం స్కందమాత అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదోరోజు ఉదయం రాజరాజేశ్వరి అమ్మవారికి మహాభిషేకం, లలిత సహస్రనామ సహిత చతుష్షష్ట్యోపచార పూజ నిర్వహించారు. సాయంత్రం పార్వతీ రాజరాజేశ్వరస్వామి, లక్ష్మీఅనంతపద్మనాభస్వామివారలను నంది-హనుమంత వాహనాలపై ఆలయ ఆవరణలో ఊరేగించారు.