Rajanna Sirisilla: మిడ్మానేరు జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం
ABN , First Publish Date - 2021-07-18T13:21:19+05:30 IST
శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేరు) జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో మానేరుకు వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్
రాజన్న సిరిసిల్ల: శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేరు) జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో మానేరుకు వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 695 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 170 క్యూసెక్కులుగా ఉంది. మిడ్మానేరు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.60 మీటర్లకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.52 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 24.37 టీఎంసీలుగా నమోదు అయ్యింది.