Rajanna Sirisilla: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం
ABN , First Publish Date - 2021-09-07T13:40:06+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి పట్టణ వీధులన్నీ జలమయం అయ్యాయి.
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి పట్టణ వీధులన్నీ జలమయం అయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయం ముందు వర్షపు నీటితో ముందు భాగంలో నీరు నిలిచిపోయింది. భారీ వర్షంతో రాజన్న దర్శనానికి విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం ముందు భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.