Rajanna Sirisilla: అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా..వలస కూలి మృతి
ABN , First Publish Date - 2021-07-30T13:26:37+05:30 IST
జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కూలి రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కూలి రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కలకత్తాకు చెందిన వలస కూలి రమేష్గా పోలీసులు గుర్తించారు.