Rajanna siricilla: పదో తరగతి బాలిక అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-11-25T17:17:26+05:30 IST
జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పదో తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పదో తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహాన్ని సిరిసిల్ల ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటాపూర్ గ్రామంలో బాలిక అమ్మమ్మ, కుటుంబీకులు అడ్డుకున్నారు. అమ్మాయిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాలిక మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.