మానేరు వాగులో చిక్కుకున్న గొర్ల కాపరి

ABN , First Publish Date - 2021-08-31T17:25:51+05:30 IST

భారీ వర్షాల కారణంగా జిల్లాలో వాగులు, వంకలు పొంగిపర్లుతున్నాయి. సిరిసిల్ల మానేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.

మానేరు వాగులో చిక్కుకున్న గొర్ల కాపరి

రాజన్న సిరిసిల్ల: భారీ వర్షాల కారణంగా జిల్లాలో వాగులు, వంకలు పొంగిపర్లుతున్నాయి. సిరిసిల్ల మానేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.  ఈ క్రమంలో గొర్రెలను కాయడానికి వచ్చిన గొర్ల కాపరి చంద్రమౌళి... సిరిసిల్ల మానేరు వాగులో చిక్కుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం గొర్రెలు మేపడానికి వెళ్లి నెహ్రూ నగర్ చెక్ డ్యామ్ సమీపంలోని వాగు మధ్యలో ఉన్న ఒడ్డు ప్రాంతంలో  చంద్రమౌళి చిక్కుకుపోయాడు. సుమారు 40 గొర్లతో పాటు వాగులో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూపులు చేస్తున్నాడు. ఫోన్ సహాయంతో స్థానికులకు సమాచారం అందజేశాడు. దీంతో స్థానికులు, అధికారులు అక్కడకు చేరుకుని చంద్రమౌళిని రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. 

Updated Date - 2021-08-31T17:25:51+05:30 IST