‘తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి’
ABN , First Publish Date - 2022-05-20T06:40:48+05:30 IST
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేయాల ని రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంక టేష్ అన్నారు.
నూజివీడు టౌన్, మే 19: ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేయాల ని రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంక టేష్ అన్నారు. నియోజక వర్గ టీడీపీ కార్యాల యం లో పార్టీ ఇన్చార్జి ముద్దర బోయిన వెంకటేశ్వరరావు అధ్యక్షతన క్లస్టర్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీని బలోపేతం చేయాలన్నారు. అనంతరం ముద్దరబోయిన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ప్రధానంగా క్రియాశీలక సభ్యత్వాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజలపై ప్రభుత్వం మోపు తున్న భారాలను ‘బాదుడే బాదుడు’లో ఎండగట్టాలన్నారు. క్లస్టర్ ఇన్చార్జి మోరంపూడి శ్రీనివాసరావు, యనమదల నాని, చలసాని గోపాలకృష్ణ, మండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.