ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం
ABN , First Publish Date - 2021-09-04T15:57:32+05:30 IST
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది.
రాజమండ్రి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.70 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2.61 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 12 వేల క్యూసెక్కుల సాగు నీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు.