రాజమండ్రిలో టీడీపీ నేతల నిరసన

ABN , First Publish Date - 2021-10-30T17:16:17+05:30 IST

రాజమండ్రిలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. విసన కర్రలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు నిరసన తెలిపారు.

రాజమండ్రిలో టీడీపీ నేతల నిరసన

రాజమండ్రి: రాజమండ్రిలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.  విసన కర్రలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ.. చేతకాని ముఖ్యమంత్రి ఏపీని పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని ఆదిరెడ్డి భవానీ తెలిపారు.

Updated Date - 2021-10-30T17:16:17+05:30 IST