కాసేపట్లో ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ
ABN , First Publish Date - 2020-08-15T19:04:40+05:30 IST
గోదావరి పొంగి పొర్లుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.
రాజమండ్రి: గోదావరి పొంగి పొర్లుతున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 11.60 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేసి 9.85 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు 9,500 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు.