Rampachodavaram: ఎమ్మెల్యే ధనలక్ష్మికి నిరసన సెగ
ABN , First Publish Date - 2022-07-20T03:45:13+05:30 IST
రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి (Mla Dhanalaxmi) వరద బాధితుల సెగ తగిలింది. కూనవరం మండలం కోతులగుట్ట ...
రాజమండ్రి (Rajahmandry): రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి (Mla Dhanalaxmi) నిరసన సెగ తగిలింది. కూనవరం మండలం కోతులగుట్ట వరద బాధిత శిబిరాన్ని సందర్శించేందుకు ఆమె వెళ్లారు. అయితే ఎమ్మెల్యేను వరద బాధితులు నిలదీశారు. ఎమ్మెల్యేపైకి ఒక్కసారిగా బాధితులంతా దూసుకుపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు.. వరద బాధితులను చెదరగొట్టి ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించారు.
అయితే వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై వరద బాధితులు (flood victims) ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లలో తాము అష్టకష్టాలు పడుతుంటే.. వైసీపీ (Ycp) ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా నష్టం వాటిల్లితే సరైన ఆర్థిక సాయం అందించడంలేదని మండిపడ్డారు.