కేసీఆర్‌‌పై రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-16T23:28:51+05:30 IST

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దింపే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తానని ప్రకటించారు.

కేసీఆర్‌‌పై రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

యాదాద్రి: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దింపే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని తప్పుబట్టారు. కాళేశ్వరం రీడిజైనింగ్‌ పేరుతో ఏపీ కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోచిపెట్టారని దుయ్యబట్టారు. 8 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు మన ఊరు-మన బడి అని కార్యక్రమాలు తెస్తున్నారని విమర్శించారు. శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రులను బాగు చేయకుండా.. కొత్త ఆస్పత్రులు కడతామంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - 2022-03-16T23:28:51+05:30 IST