బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాతో రైతులు నష్టపోయారు: రాజగోపాల్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-17T03:05:47+05:30 IST
బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాతో రైతులు నష్టపోయారని కాంగ్రెస్ నేత రాజగోపాల్రెడ్డి వచ్చారు.
హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాతో రైతులు నష్టపోయారని కాంగ్రెస్ నేత రాజగోపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే రైతులు 30% ధాన్యం మిల్లర్లకు అమ్ముకుని నష్టపోయారని చెప్పారు. పంట చేతికి వచ్చే సమయానికి రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే 24 గంటల కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మార్పుపై మునుగోడు ప్రజల సమక్షంలోనే నిర్ణయం తీసుకుంటామని రాజగోపాల్రెడ్డి తెలిపారు.