అరాచక పాలన సాగదు
ABN , First Publish Date - 2021-10-20T06:15:53+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన ఎన్నాళ్లో సాగదని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 672వ రోజుకు చేరుకుంది.
672వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు
తుళ్లూరు, అక్టోబరు 19: రాష్ట్రంలో అరాచక పాలన ఎన్నాళ్లో సాగదని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 672వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాజధానిపై మోసపూరితంగా వ్యవహరించడం జగన్రెడ్డికే చెల్లిందన్నారు. అభివృద్ధి లేకుండా పాలన చేయటం ప్రజలు చేసుకున్న పాపమని తెలిపారు. పాలకులు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా అరాచకం చేయడంపై దృష్టి పెట్టారన్నారు. ప్రతిపక్షాలను బెదిరించి అడ్డగోలుగా పాలన చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. అమరావతికి అండగా ఉండే పార్టీలను భయపెట్టడానికే ఈ దాడి చేశారన్నారు. రాజధాని గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి.