అమరావతిపై.. అన్యాయం చేయకండి

ABN , First Publish Date - 2020-11-29T06:00:02+05:30 IST

అమరావతి విషయంలో పాలకులు మారాలని.. అన్యాయం చేయవద్దంటూ రాజధాని రైతులు డిమాండ్‌ చేశారు.

అమరావతిపై.. అన్యాయం చేయకండి
నీరుకొండ దీక్షా శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

347వ రోజు అమరావతి ఆందోళనల్లో రైతుల డిమాండ్‌


తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, నవంబరు 28: అమరావతి విషయంలో పాలకులు మారాలని.. అన్యాయం చేయవద్దంటూ రాజధాని రైతులు డిమాండ్‌ చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు చేస్తో న్న ఉద్యమం శనివారంతో 347వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ అమరావతిని నిర్వీర్యం చేస్తే పాలకులకు ఆ పాపం తగులుతుందన్నారు. కల్మషం లేకుం డా రాజధాని కోసం భూములు ఇస్తే, లేని పోని ఆరోపణలు చేస్తే పాలకులకు మంచి జరగదన్నారు. మూడు రాజధానులపై కేంద్రం సూచన ల మేరకు సీఎం జగన్‌ నడుచుకుంటు న్నార న్నారు. త్వరలోనే గుట్టు రట్టవుతుందన్నా రు. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, రా యపూడి, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపా లెం, వెలగపూడి, ఐనవోలు, మందడం, యర్ర బాలెం, బేతపూడి, నీరుకొండ, పెనుమాక  గ్రామాల్లో నిరసనలు చేపట్టారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. 


-  తాడేపల్లి మండలం పెనుమాక, మంగ ళగి రి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతుల దీక్షలు 347వ రోజుకు చేరాయి.తాడికొండ మండలం మోతడక గ్రా మంలో రైతులు, మహిళలు నిరసనలు కొన సాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గుండెలు ఆగిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరె త్తినట్లు ఉందన్నారు. మూడు రాజధానులుఅని జగన్‌ మతిలేని ప్రకటనలు  చేస్తున్నారన్నారు.


Updated Date - 2020-11-29T06:00:02+05:30 IST