TS News: అవినీతికి పాల్పడిన నేతలు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలి: రాజాసింగ్

ABN , First Publish Date - 2022-08-10T22:21:00+05:30 IST

అవినీతికి పాల్పడిన నేతలు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శాసనసభాపక్షనేత రాజాసింగ్ (Raja Singh) హెచ్చరించారు.

TS News: అవినీతికి పాల్పడిన నేతలు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలి: రాజాసింగ్

హైదరాబాద్: అవినీతికి పాల్పడిన నేతలు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శాసనసభాపక్షనేత రాజాసింగ్ (Raja Singh) హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ (TRS)లో చాలా మంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారని తెలిపారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఈడీ కేసుల గురించి.. టీఆర్ఎస్ నేతలు పదే పదే మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (KTR) పట్ల టీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామని ప్రకటించారు. ఈనెల 21న కేంద్రమంత్రి అమిత్ షా సభలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని రాజాసింగ్ వెల్లడించారు.

Updated Date - 2022-08-10T22:21:00+05:30 IST