‘కరోనా కేసుల సంఖ్య ఎందుకు పెరిగిందో అసద్‌కు తెలియదా?’

ABN , First Publish Date - 2020-04-05T20:09:02+05:30 IST

దేశ సమైక్యత విషయంలో రాజకీయాలు వద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.

‘కరోనా కేసుల సంఖ్య ఎందుకు పెరిగిందో అసద్‌కు తెలియదా?’

హైదరాబాద్ : దేశ సమైక్యత విషయంలో రాజకీయాలు వద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా కేసులు పెరగడానికి నిజాముద్దీన్‌ సమావేశంలో పాల్గొనడమే కారణమన్నారు. కరోనాకు మతం రంగు పులుముతున్నారని అనడానికి అసద్‌కు సిగ్గుండాలన్నారు. తెలంగాణలో కేసుల సంఖ్య ఎందుకు పెరిగిందో అసద్‌కు తెలియదా? అని ఈ సందర్భంగా ఆయన సూటి ప్రశ్న సంధించారు. 


కాపాడుకో.. అసద్!

ఇంట్లో కూర్చొని ట్వీట్లు పెట్టడం కాదు.. ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. నా నియోజకవర్గంలో కుల, మతాలకతీతంగా వేలాది మందికి అన్నదానం చేస్తున్నాను. అసద్ ఒక్క పేద ముస్లిం కుటుంబానికైనా భోజనం పెట్టారా?. చాలా మంది పేద ముస్లింలు ప్రమాదంలో పడ్డారు..వారిని కాపాడుకోవాలిఅని అసద్‌కు రాజాసింగ్ సూచించారు.

Updated Date - 2020-04-05T20:09:02+05:30 IST