నిమజ్జనంపై పోలీసుల నోటీసులు సరికాదు: రాజాసింగ్

ABN , First Publish Date - 2021-09-12T21:22:25+05:30 IST

సాగర్‌లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులను ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుపట్టారు.

నిమజ్జనంపై పోలీసుల నోటీసులు సరికాదు: రాజాసింగ్

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుపట్టారు. నిమజ్జనం ఎక్కడ చేయాలో చెప్పకుండా మండపాల నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సరైన వాదనలు వినిపించలేదని విమర్శించారు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం వద్దంటే ప్రగతి భవన్ వద్ద విగ్రహాలు పెడతామని రాజాసింగ్ హెచ్చరించారు.

Updated Date - 2021-09-12T21:22:25+05:30 IST