నంద్యాలలో ‘రైతు దగా’ కార్యక్రమం
ABN , First Publish Date - 2022-07-08T23:36:17+05:30 IST
నంద్యాల: టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో రైతు దగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస సెంటర్ నుంచి ఎన్టీఆర్
నంద్యాల: టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో రైతు దగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస సెంటర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతులను దగా చేస్తున్న వైసీపీ ప్రభుత్వం డౌన్.. డౌన్ .. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, టీడీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు
మౌలానా తదితరులు పాల్గొన్నారు.