నేడు రైతు భరోసా సొమ్ము విడుదల

ABN , First Publish Date - 2021-05-13T06:24:52+05:30 IST

వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు సంబంధించి ఈ ఏడాది తొలి విడత సొమ్మును గురువారం ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి విడుదల చేయనున్నారు.

నేడు రైతు భరోసా సొమ్ము విడుదల

అనంతపురం వ్యవసాయం, మే 12: వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు సంబంధించి ఈ ఏడాది తొలి విడత సొమ్మును గురువారం ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి విడుదల చేయనున్నారు. 2021-22 సంవత్సరానికి తొలి విడతలో జిల్లాలోని 572816 మంది రైతు కుటుంబాలకు రూ.429.62 కోట్లు జమ చేయనున్నట్లు ఇనచార్జి జేడీఏ రామకృష్ణ పేర్కొన్నారు. ఇందులో రూ.315.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున, మిగిలిన రూ.114. 52 కోట్లు పీఎం కిసాన నుంచి జమవుతాయన్నారు. ఒక్కో కుటుంబానికి తొలి విడతలో రూ.7500 జమ చేస్తారన్నారు. ఇందులో రూ. 5500 రాష్ట్ర ప్రభుత్వం, రూ.2 వేలు పీఎం కి సాన నుంచి విడుదలవుతాయన్నారు.

Updated Date - 2021-05-13T06:24:52+05:30 IST