ఆర్బీకేలలోనే విత్తనాలు అమ్మాలి
ABN , First Publish Date - 2021-05-18T16:04:57+05:30 IST
రైతు భరోసా కేంద్రాలలో..
వ్యవసాయ కమిషనర్ అరుణ్కుమార్
గుంటూరు: రైతు భరోసా కేంద్రాలలో అన్నిరకాల విత్తనాలు అమ్మాలని వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్కుమార్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో విత్తన సరఫరా, సబ్సిడీ విత్తనాల పంపిణీ తదితర అంశాలపై కమి షనర్ సోమవారం జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ మా ట్లాడు తూ అన్ని రకాల విత్తన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకు న్నట్లు ఆర్బీకేలకు విత్తనాలు సరఫరా చేయకపోతే వాటిపై చర్యలు తీసుకోవా లన్నారు. జేడీ విజయభారతి మాట్లాడుతూ మిర్చి విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.