ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంచాలి

ABN , First Publish Date - 2022-01-19T04:51:20+05:30 IST

ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయాధికారులు కృషి చేయాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ తుంపాల అప్పారావు సూచించారు.

ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంచాలి
మాట్లాడుతున్న తుంపాల అప్పారావు

సబ్బవరం, జనవరి 18 : ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయాధికారులు కృషి చేయాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ తుంపాల అప్పారావు సూచించారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఏవో పోతల సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఎంపీపీ బోకం సూర్యకుమారి మాట్లాడుతూ రైతులు ఆర్‌బీకేలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్‌నాయుడు, వ్యవసాయ సలహా మండల చైర్మన్‌ విరోతి చినఅప్పలనాయుడు, సభ్యులు బుజ్జి, సూర్యనారాయణ, బోని నాయుడు, ఎడ్ల నాయుడు, హెచ్‌వో రాధిక, వీఏఏలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-19T04:51:20+05:30 IST