ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించండి

ABN , First Publish Date - 2021-10-28T06:18:22+05:30 IST

నివేశన స్థలాల లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించిన నివేశన స్థలంలో త్వరతగతిన పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ మండలస్థాయి అధికా రులను ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించండి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

 కలెక్టర్‌ నివాస్‌

జి.కొండూరు, అక్టోబరు 27: నివేశన స్థలాల లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించిన నివేశన స్థలంలో త్వరతగతిన పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ మండలస్థాయి అధికా రులను ఆదేశించారు.  వెలగలేరు, హెచ్‌.ముత్యాలంపాడు లేఅవుట్‌లను బుధవారం అధికారులతో కలిసి పరిశీలిం చారు. లే అవుట్స్‌కు సంబంధించి అప్రోచ్‌ రోడ్డులను వారంలో పూర్తి చేయాలన్నారు. బుడమేరు పక్కనే ఉన్న ఈఅవుట్స్‌కు అప్రొచ్‌ రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో త్వరతిగతిన పనులు పూర్తి చేయించాలన్నారు. బీఎంసీ లబ్ధిదారులకు హెచ్‌.ముత్యాలంపాడులో కేటాయించిన లేఅవుట్స్‌లో మౌలికవసతులు కల్పించాలన్నారు. లబ్ధిదారులు ప్రభు త్వం నుంచి నిర్మాణాలకు అవసరమైన ముడి సరుకు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, తహసీల్దార్‌ ఇంతియాజ్‌ పాషా, ఎంపీడీవో పి.అనురాధ, డాక్టర్‌ ఎ.శ్రీకల్యాణి, హౌసింగ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-28T06:18:22+05:30 IST