అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2021-04-17T06:45:19+05:30 IST

అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కేంద్ర అగ్నిమాపకాధికారి శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు.

అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలి
అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఫైర్‌ అధికారి శ్యాంసుందర్‌రెడ్డి

నల్లగొండ క్రైం, ఏప్రిల్‌ 16 : అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కేంద్ర అగ్నిమాపకాధికారి శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి జిల్లా కేంద్రంలోని వివిధ అపార్టుమెంట్లలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే వెంటనే సమాచారం అం దించాలని సూచించారు. ఈనెల 20వ తేదీ వరకూ విద్యా సంస్థలు, మార్కెట్‌ సముదాయాలు, అపార్టుమెంట్లతో పాటు అన్ని ప్రాంతాల్లో అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్‌పీజీ గ్యాస్‌ ప్రమాదాలు, విద్యుత్‌ ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది జగన్‌రెడ్డి, గోవింద్‌, శంకర్‌, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T06:45:19+05:30 IST