సాగు హక్కు పత్రాలపై కౌలు రైతుల్లో అవగాహన పెంచాలి

ABN , First Publish Date - 2021-06-18T06:20:32+05:30 IST

విధిగా గ్రామస్థాయిలో కౌలురైతు లు సాగు హక్కు పత్రాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం సచి వాలయ ఏఎస్‌స్‌, ఏహెచఎస్‌లపై ఉందని కదిరి వ్యవసాయశాఖ సహా య సంచాలకులు ఎస్‌ సత్యనారాయణ పేర్కొన్నారు.

సాగు హక్కు పత్రాలపై కౌలు రైతుల్లో అవగాహన పెంచాలి

- ఏడీఏ సత్యనారాయణ 

ఓబుళదేవరచెరువు, జూన 17: విధిగా గ్రామస్థాయిలో కౌలురైతు లు సాగు హక్కు పత్రాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం సచి వాలయ ఏఎస్‌స్‌, ఏహెచఎస్‌లపై ఉందని కదిరి వ్యవసాయశాఖ సహా య సంచాలకులు ఎస్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం స్థానిక రైతు భరోసా కేంద్రంలో వీఏఏ, వీహెచఏ, వీఎస్‌ఏలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలురైతులు సాగుచేస్తున్న పంటలపై వారికి హక్కులు కల్పించే విధంగా రాష్ట్ర ప్ర భుత్వం గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రభు త్వ పథకాలు లబ్ధి చేకూరేలా చేస్తోందన్నారు. కౌలురైతులు, భూ యజ మాని, గ్రామరెవెన్యూ అధికారిని కలసి కౌలుసాగు హక్కు పత్రం పొం దాలన్నారు. ఈ నెల ఆఖరులోపు వాటిని భూమిలేని కౌలురైతులు , రైతు భరోసా కొరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కౌలురైతులు కేవలం పండించిన పంటమీదే హక్కు కల్గి ఉంటారన్నారు. భూమి పై ఎటువంటి హక్కు పొందలేరని తెలియజేశారు. ప్రతి కౌలురైతు భూ యజమాని అనుమతితో వీఆర్‌ఓను కలసి కౌలుహక్కు పత్రాన్ని పొందా లని ఆ తర్వాత పంటలను ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేసుకోవాలన్నారు. ఆ పం టను మద్దతు ధరకు అమ్ముకునే వీలు ఉంటుం దన్నారు. ఈ ప్రక్రి యను ఈ నెల 25 లోగా పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి గణేష్‌, సర్పంచు గోవిందు, వీఆర్‌ఓ మునెప్ప, వీఎస్‌ఏ, వీఏఏ, ఎనఈపీఓ , గ్రామ వలంటీర్లు, రైతు లు టిన్ను నాగరాజు, వినోద్‌, దామోదర్‌, గంగాద్రి, కుళ్ళాయప్ప, రఘునాయుడు, చంద్రశేఖర్‌, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T06:20:32+05:30 IST