రానున్న రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు

ABN , First Publish Date - 2020-04-10T18:58:18+05:30 IST

విదర్భ నుంచి తమిళనాడు వరకు నెలకొన్న ఉపరితల ద్రోణితో..

రానున్న రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు

అమరావతి: విదర్భ నుంచి తమిళనాడు వరకు నెలకొన్న ఉపరితల ద్రోణితో ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన అకాలవర్షం కురవగా.. శుక్ర, శనివారాలు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలో ఐదారు మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాయుడు పేటలో 102, గూడూరులో 100, మద్దెపాడులో 94.5 మి.మీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది.


పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చెదురుముదురుగా జల్లులు పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ లేక గిట్టుబాటు ధర దొరక్కా అల్లాడిపోతుంటే... ఇప్పుడు కల్లాల్లో ఉన్న పంట కూడా తడిసిపోవడంతో నాణ్యత లేదంటూ.. వ్యాపారులు ధర తగ్గిస్తారేమోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చి అమ్ముకునే తరుణంలో పాడైన ఉత్పత్తిని అమ్మాలంటే కష్టమని, గిట్టుబాటు ధర రాకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.


Updated Date - 2020-04-10T18:58:18+05:30 IST