ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు
ABN , First Publish Date - 2022-01-10T23:51:01+05:30 IST
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జనగాం కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో నగరంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.