రోడ్లపైనే వర్షపు నీరు
ABN , First Publish Date - 2022-08-09T05:43:44+05:30 IST
కురుస్తున్న వర్షాలకు నీరు వెళ్లే దారి లేక రోడ్లపై నిలిచిపోతున్నాయి.
ట్రాఫిక్ జామ్
ఇబ్బందుల్లో వాహనదారులు
నిజాంపేట్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కురుస్తున్న వర్షాలకు నీరు వెళ్లే దారి లేక రోడ్లపై నిలిచిపోతున్నాయి. సూరారం ఆర్కె ట్రాన్సపోర్టు, మల్లారెడ్డి ఆస్పత్రి దగ్గర, గండిమైసమ్మ బావర్చి హోటల్ దగ్గర ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతోంది. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లను తవ్వి పనులు చేయకుండా వదిలేయడంతో ఈ సమస్య తలెత్తుతోందని స్థానికులు తెలిపారు.