టాస్ కూడా వేయలేదు.. అప్పుడే వర్షం..
ABN , First Publish Date - 2020-07-08T22:19:11+05:30 IST
ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్కు...
సౌతాంప్టన్: ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్కు వర్షం కారణంగా ఆదిలోనే అంతరాయం కలిగింది. టాస్ కూడా వేయలేదు. వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి టాస్ వేసేందుకు అనుకూలమయిన పరిస్థితి లేదు. వర్షం కారణంగా నేలంతా తడిగా మారింది. ఆకాశం మేఘావృతమై ఉంది. కారు మేఘాలు కమ్ముకున్నాయి.
దాదాపు 117 రోజుల తర్వాత ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుండటంతో అంతా సజావుగా జరుగుతుందని ఆశించిన క్రికెట్ ఫ్యాన్స్కు వర్షం కారణంగా నిరాశే ఎదురైంది. మ్యాచ్ మొదలవడం ఆలస్యమైనప్పటికీ తర్వాతయినా సజావుగా జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కరోనా కారణంగా క్రికెట్ అభిమానుల కేరింతలు లేకుండానే మ్యాచ్ జరగనుంది.