వెల్లింగ్టన్ టెస్ట్: ఆగిన మ్యాచ్ ... భారతజట్టు స్కోర్ ఎంతంటే..

ABN , First Publish Date - 2020-02-21T15:42:47+05:30 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.

వెల్లింగ్టన్ టెస్ట్: ఆగిన మ్యాచ్ ... భారతజట్టు స్కోర్ ఎంతంటే..

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత జట్టు 55 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 పరుగుల లోపే 3 వికెట్లు కోల్పోయింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఓపెనర్ పృథ్వీ షా, ఆ తర్వాత వచ్చిన చటేశ్వర పుజారా(11), విరాట్ కోహ్లీ(2) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(34) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా.. బోల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. హనుమ విహారీ(7) కూడా స్వల్ప స్కోర్‌కే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రహానే, రిషబ్ పంత్ ఉన్నారు. కివీస్ బౌలర్లలో జామిసన్ మూడు వికెట్లు, సోథీ, బోల్ట్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-02-21T15:42:47+05:30 IST