రైల్వే ట్రాక్‌ మరమ్మతులు

ABN , First Publish Date - 2021-06-24T05:29:16+05:30 IST

రైల్వే ట్రాక్‌ మరమ్మతులు

రైల్వే ట్రాక్‌ మరమ్మతులు
తాండూరు-మంతట్టి స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్రాక్‌ పనులు

తాండూరు రూరల్‌: తాండూరు-మంతట్టి రైల్వే స్టేషన్ల మధ్య ఈ నెల 18 నుంచి రైలు పట్టాల మరమ్మతులు కొనసాగుతున్నాయి. పీర్‌ఫకీర్‌సాబ్‌ దర్గా సమీపంలో నారాయణపూర్‌ వెళ్లే రైల్వే గేటును మూసి వేసి పనులు చేస్తున్నారు. ఆ మార్గంలో 52గేజ్‌ పట్టాల ను తొలగించి ప్రస్తుతం 60గేజ్‌ పట్టాలు వేస్తున్నారు. మరో నాలుగైదు రోజులపా టు పనులు జరుగనున్నందున ఈ ప్రాం త ప్రజలు సహకరించాలని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రైల్వే గేటును మూసి ఉంచడంతో నారాయణపూర్‌, గోనూరు, వీర్‌శెట్టిపల్లి, మంతట్టి, రెడ్డిఘనాపూర్‌, కాశీంపూర్‌ తదితర గ్రా మాల ప్రజలు చుట్టూ తిరిగి లక్ష్మీనారాయణపూర్‌ మీదుగా తాండూరు చేరుకుంటున్నారు. 

Updated Date - 2021-06-24T05:29:16+05:30 IST