Bizarre: విధుల్లో మద్యం తాగి నిద్రపోయిన ఏఎస్ఎం

ABN , First Publish Date - 2021-07-17T17:39:54+05:30 IST

రైల్వేస్టేషనులో విధుల్లో ఉన్న అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పీకల దాకా మద్యం తాగి, అక్కడే నిద్ర పోవడంతో ఢిల్లీ-హౌరా మార్గంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలచి పోయిన...

Bizarre: విధుల్లో మద్యం తాగి నిద్రపోయిన ఏఎస్ఎం

ఢిల్లీ-హౌరా మార్గంలో నిలిచిపోయిన రైళ్లు

న్యూఢిల్లీ : రైల్వేస్టేషనులో విధుల్లో ఉన్న అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పీకల దాకా మద్యం తాగి, అక్కడే నిద్ర పోవడంతో ఢిల్లీ-హౌరా మార్గంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలచి పోయిన వింత ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అనిరుద్ధ్ కుమార్ రైల్వేస్టేషను విధులకు హాజరై పీకలదాకా మద్యం తాగి నిద్రపోయాడు. ఢిల్లీ-హౌరా మార్గంలో పలు రైళ్లు రాకపోకలకు సిగ్నల్ ఇవ్వాల్సిన అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో పరక్కా, మగద్ ఎక్స్ ప్రెస్, గూడ్సు రైళ్లు ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. 


వివిధ స్టేషన్ల నుంచి రైల్వే అధికారులు ఫోన్ చేసినా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అనిరుద్ కుమార్ స్పందించలేదు.మద్యం మత్తులో జోగుతూ అనిరుద్ కుమార్ నిద్రపోతున్నట్లు గుర్తించిన స్టేషన్ మాస్టర్ విశాంభర్ ఫిర్యాదు చేశారు. ఏఎస్ఎంను సస్పెండ్ చేసి అతనిపై చార్జిషీట్ దాఖలు చేశారు. విధి నిర్వహణలో మద్యం మత్తులో ఉన్న అనిరుద్ కుమార్ ను తుండ్లాలోని రైల్వే ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేశారు.   

Updated Date - 2021-07-17T17:39:54+05:30 IST