శ్రామిక్ రైళ్లలో 80 మంది వలసకార్మికుల మృతి...ఆర్‌పీఎఫ్ ప్రకటన

ABN , First Publish Date - 2020-05-30T15:01:33+05:30 IST

రైల్వేశాఖ నడిపిన శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మరణించారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సమీక్షలో...

శ్రామిక్ రైళ్లలో 80 మంది వలసకార్మికుల మృతి...ఆర్‌పీఎఫ్ ప్రకటన

 న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు మే 9 నుంచి 27వతేదీ వరకు రైల్వేశాఖ నడిపిన శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మరణించారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సమీక్షలో వెల్లడైంది.రైల్వేశాఖ మే 1నుంచి 27వతేదీ వరకు దేశంలో 3,840శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి 5 మిలియన్ల మంది వలసకార్మికులకు వారి స్వస్థలాలకు చేర్చింది. శ్రామిక్ రైళ్లలో ఆకలి, వేడి వల్ల పలువురు వలసకార్మికులు రైళ్లలోనే మరణించారు. దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వలసకార్మికులు రైలు ప్రయాణంలో మరణించారని రైల్వే శాఖ ప్రకటించింది. శ్రామిక్ రైళ్లలో 80 మంది మరణించారని రైల్వే అధికారిక ప్రతినిధి వెల్లడించారు. రైళ్లలో ప్రయాణికులు  ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైల్వేబోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. రైళ్లలో భోజనం దొరక్క ఎవరూ మరణించలేదని రైల్వేబోర్డు ఛైర్మన్ చెప్పారు. నార్త్ ఈస్ట్రరన్ రైల్వేలో 18మంది, నార్త్ సెంట్రల్ జోన్ లో 19 మంది, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 13మంది మరణించారు. 

Updated Date - 2020-05-30T15:01:33+05:30 IST